thesakshi.com : 2024లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు ఏపీలో పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆయన శక్తి కేంద్ర ప్రముఖులను ఉద్దేశించి ప్రసంగించారు మరియు బూత్ల వారీగా పార్టీ ప్రజలకు చేరువ కావాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.ఏపీలో 46,000 పోలింగ్ బూత్లు ఉన్నాయని ఆయన గుర్తించారు. ఏపీలో బీజేపీకి ఉన్న 10,000 శక్తి కేంద్రాల్లో దాదాపు 2,500కి స్థానిక కమిటీలు లేవని, వాటిని ఏర్పాటు చేయాలని భావించారు.
మేధావులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, గత ఎనిమిదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ ఎనిమిదేళ్లలో దేశంలో పేదల సంఖ్య 22 నుంచి 10 శాతానికి తగ్గిందని ఆయన చెప్పారు.
Addressing a public meeting in Rajamahendravaram, Andhra Pradesh. https://t.co/epB8EUo9uz
— Jagat Prakash Nadda (@JPNadda) June 7, 2022
అమెరికా జీడీపీ 4.6 శాతానికి వ్యతిరేకంగా తాజా లెక్కల ప్రకారం భారత జీడీపీ 8.7 వృద్ధిని నమోదు చేసిందని నడ్డా చెప్పారు. భారతదేశ తలసరి ఆదాయం 1.5 లక్షలకు చేరుకోగా, GDP వృద్ధి రెండింతలు పెరిగింది మరియు ఎగుమతులు రికార్డు స్థాయిలో వృద్ధి చెందాయి. భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పటికి మూడు ట్రిలియన్ డాలర్ల మార్కును అధిగమించిందని ఆయన అన్నారు.
అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. “ఏపీ రాజకీయాల్లో బీజేపీని ప్రత్యామ్నాయ శక్తి కేంద్రంగా మార్చే ప్రయత్నాల్లో భాగంగా ప్రతి పోలింగ్ బూత్ ప్రాంతంలో శక్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. ప్రజా వ్యతిరేక విధానాలు, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోలింగ్ బూత్ స్థాయి వరకు పోరాడతాం.
2014 నుంచి ప్రధాని మోదీ ఏపీని అభివృద్ధి చేస్తున్నారని.. బీరువా తర్వాత రాష్ట్రంలో సహజవనరులు పుష్కలంగా ఉన్నా రాజధాని లేదన్నారు. గుజరాత్, యూపీ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాల ద్వారానే మోదీ అభివృద్ధి సాధించారన్నారు.
బిజెపి జాతీయ కార్యదర్శి పురంధేశ్వరి మాట్లాడుతూ ఇతర రాజకీయ పార్టీలతో పోల్చితే బిజెపికి ఒక ప్రత్యేకత ఉందని, అది ఒక సిద్ధాంతం మరియు కార్యాచరణ ప్రణాళిక ఆధారంగా పని చేస్తుందని అన్నారు.
ఏపీలో వైయస్సార్సీపీ ప్రభుత్వం పోయి.. బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధీమా వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బీజేపీ గోదావరి గర్జన సభకు నడ్డా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఏపీ సర్కారు విచక్షణారహితంగా అప్పులు చేస్తోందని మండిపడ్డారు. జగన్ హయాంలో అవినీతి తారస్థాయికి చేరిందని మండిపడ్డారు. ఇసుక, భూమి, మద్యం మాఫియా అడ్డూ అదుపులేకుండా చేలరేగిపోతుందన్నారు.
ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందన్నారు జేపీ నడ్డా. రాష్ట్రంలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారు. పెట్టుబడులు రాక రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోంది. రాష్ట్రంలో రూ.8.7 లక్షల కోట్ల పెట్టుబడులు కేంద్రం పెడుతోంది. రాష్ట్రంలోని ప్రార్థనా స్థలాలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. బీజేపీ హయాంలో మాతృభాషకు పెద్దపీట వేశామని..,రాష్ట్రంలో తెలుగు భాషకు అన్యాయం జరుగుతోందని వ్యాఖ్యనించారు.
పలు సంక్షేమ పథకాలకు నిధులు తగ్గుతున్నాయని, కేంద్రం తరఫున రూ.77 వేల కోట్లు అందించామని జేపీ నడ్డా చెప్పారు. పీఎం ఆవాస్ యోజన కింద ఏపీకి 27 లక్షల ఇళ్లు, ఏపీ ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ, గిరిజన వర్సిటీ మంజూరు చేశామని వెల్లడించారు జేపీ నడ్డా. బీజేపీ హయాంలో సాగు బడ్జెట్ రూ.1.04 లక్షల కోట్లకు పెరిగిందని, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల ఖాతాల్లో రూ.2 లక్షల కోట్లు జమ చేశామన్నారు. ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యంతో రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని, కేంద్ర నిధులను రాష్ట్రం పక్కదారి పట్టిస్తోందని జేపీ నడ్డా ఆరోపించారు. ప్రతిపక్షాలపై అనేక రకాల ఆంక్షలు విధిస్తున్నారన్నారు. రాష్ట్రంలో వైసీపీ పోవాలి.. బీజేపీ రావాలి అనే నినాదానిచ్చారు జేపీ నడ్డా.
2014కు ముందు దేశంలో తీవ్రమైన విద్యుత్ కోతలు ఉండేవి. గతంలో ఆరోగ్య రక్షణ, ఆరోగ్య బీమాకు ఎలాంటి హామీ లేదు. గతంలో అవినీతి, కుంభకోణాలు మాత్రమే వార్తలు నిలిచేవి. గతంలో బంధుప్రీతి, వారసత్వానికి పరాకాష్టగా పాలన సాగేది. కానీ, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక అన్ని రంగాల్లో సంస్కరణలు తెచ్చారు. మోడీ రాజకీయ దృక్కోణాన్ని పూర్తిగా మార్చారు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేశారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో ముందుకెళ్తున్నాం. దేశంలో అవినీతిని పారద్రోలేందుకు చర్యలు తీసుకున్నామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. దేశంలో 35 కోట్ల మందికి ముద్ర రుణాలు అందించామని జేపీ నడ్డా వెల్లడించారు. కరోనా వేళ 80 కోట్ల మందికి రేషన్ అందించినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 23 ఎయిమ్స్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. బీజేపీ హయాంలో పేదరికం 0.8 శాతం తగ్గిందని, దేశంలో ప్రాథమిక పాఠశాలలు 6.53 లక్షలకు చేరాయని వెల్లడించారు. భారత్లో 70 వేల స్టార్టప్లు సేవలందిస్తున్నాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 142 నుంచి 63వ స్థానానికి చేరామన్నారు.
వంద దేశాలకు కరోనా టీకా డోసులు అందించామని, 48 దేశాలకు ఉచితంగా కరోనా టీకా డోసులు అందజేశామని తెలిపారు. ఖాదీ వారసులమని కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటోందని, అయితే, బీజేపీ హయాంలోనే రూ.1.15 లక్షల కోట్ల ఖాదీ అమ్మకాలు జరిగాయాన్నారు. భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా వెళ్తోందని నడ్డా వివరించారు.