THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

దేశం అంతా జగన్ వైపు..!

thesakshiadmin by thesakshiadmin
June 3, 2022
in Latest, Politics, Slider
0
దేశం అంతా జగన్ వైపు..!
0
SHARES
591
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com   :   ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఇద్దరు నేతలు 45 నిమిషాల పాటు క్లోజ్ అయ్యారు. రాష్ట్ర, కేంద్ర సమస్యలపై చర్చించినట్లు తెలిసింది.

ఈ ఏడాది జూలైలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ప్రధాని జగన్‌కు అధికారికంగా అభ్యర్ధన చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బిజెపి తన అభ్యర్థిని కనుగొనే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది మరియు జగన్ మద్దతు కోరుతూ అధికారిక అభ్యర్థన చేయడానికి ముందు మోడీ పేరును వెల్లడించినట్లు తెలిసింది.
మొత్తం 10,98,903 ఓట్లను కలిగి ఉన్న ఎలక్టోరల్ కాలేజీలో NDAకి 5,30,690 ఓట్లు ఉండగా, సాధారణ మెజారిటీ 5,49,452 ఓట్లు. బీజేపీకి 18,762 ఓట్ల కొరత ఉంది.

ఎన్డీయేలో భాగం కాని వైఎస్సార్ కాంగ్రెస్‌కు అసెంబ్లీలో 28 ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలతో కలిపి 43,674 ఓట్లు ఉన్నాయి. రాష్ట్రపతి ఎన్నికలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సునాయాసంగా విజయం సాధించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతు స్పష్టమైన ఆధిక్యాన్ని ఇస్తుంది.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతును జగన్‌ బీజేపీకి అందజేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే పోలవరం ప్రాజెక్టుకు ఆర్థిక సాయం, ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టుకు ఖర్చు చేసిన సొమ్ము రీయింబర్స్‌మెంట్‌ తదితర డిమాండ్‌ల చార్టర్‌ను జగన్‌ ప్రధాని ముందు ఉంచారని చెబుతున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్థిక సమస్యలను త్వరగా పరిష్కరించాలన్న తన అభ్యర్థనను కూడా ముఖ్యమంత్రి పునరుద్ధరించే అవకాశం ఉంది. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన జగన్ రాష్ట్రానికి రావాల్సిన 17 వేల కోట్లు విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సహాయాన్ని అందించడంలో బ్యాంకులు ఉదారంగా వ్యవహరించాలని కేంద్ర ఆర్థిక మంత్రిని అభ్యర్థించారు.

ముఖ్యమంత్రి శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం . జగన్ రెండో రోజు దేశ రాజధానిలో ఉండి కేంద్ర మంత్రులతో భేటీ అవుతారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

రాజకీయాల్లో ఎపుడేమి జరుగుతుందో కూడా ఎవరూ ఊహించలేరు. అలాంటిది ఇపుడు వైసీపీకి ఒక విధంగా గోల్డెన్ చాన్స్ వచ్చింది అని అంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ఓట్లే తులాభారంగా మారనున్నాయి. దాంతో వైసీపీ మద్దతు ఇపుడు కేంద్రానికి కీలకం. 2017 నాటి అనుకూల పరిస్థితి అయితే బీజేపీకి లేదని చెప్పాలి. నాడు ఎక్కువ శాతం ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టిన బీజేపీకి ఈసారి సౌత్ లో జగన్ మాత్రమే ఆశాకిరణంగా ఉన్నారు.

బీజేపీ తన సొంత మనిషిని రాష్ట్రపతిగా గెలిపించుకోవడానికి వైసీపీ మీద కచ్చితంగా ఆధారపడితీరాలి. దాంతో బీజేపీ మీద వైసీపీ పై చేయి సాధించినట్లే. జగన్ సీఎం గా ఎన్నికైన కొత్తలో ఢిల్లీ వెళ్లి ఒక మాట మీడియాకు చెప్పారు. అదేంటీ అంటే బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చింది కాబట్టి ప్రత్యేక హోదా సహా కీలక విషయాల్లో అడగడమే తప్ప డిమాండ్ చేసే పరిస్థితి ఉండదని…

కానీ ఇపుడు అంతకంటే మహదవకాశం రాష్ట్రపతి ఎన్నికల రూపంలో వచ్చింది. ఒక విధంగా మోడీ అమిత్ షాల వ్యక్తిగత ప్రతిష్టకు రాష్ట్రపతి ఎన్నికలు గీటుగాయిగా మారుతాయని అంటున్నారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్ధిని ఓడగొట్టాలని విపక్ష శిబిరం కసిగా పనిచేస్తోంది. దాంతో అతి చిన్న మెజారిటీతోనే బీజేపీ రాష్ట్రపతి అభ్యర్ధి గెలిచే వీలుంది.

మరి జగన్ ఈ కీలక సమయంలో ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలిశారు. ఆయన ఎప్పటిమాదిరిగానే ఏపీ సమస్యల మీద విన్నపాలు చేశారు. ఏపీకి ఉన్న రెవిన్యూ లోటుని 16 వేల కోట్ల రూపాయలను విడుదల చేయమని కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ కి సవరించిన అంచనాల మేరకు నిధులు ఆమోదించి విడుదల చేయలని కోరుతున్నారు. ఇంకా చాలా పెద్ద చిట్టానే జగన్ ప్రధాని ముందు ఉంచారు.

అంతా బాగానే ఉన్నా ఇలాంటి విన్నపాలతో కూడిన వినతిపత్రాలను జగన్ మూడేళ్ల కాలంలో ఎన్నో సార్లు ఇచ్చారు కానీ ఈసారి మాత్రం ప్రత్యేకత ఉంది. మోడీ షాలు జగన్ వైపు ఆశగా చూస్తున్న వైనం ఉంది. జగన్ కనుక ఎస్ అంటే కేంద్ర పెద్దలకు మహదానందం. ఆయన నో చెబితే బీజేపీలో బీపీ చెలరేగడం ఖాయం.

అలా జగన్ వ్యవహరించిన పక్షంలో కేంద్రం దారికి వచ్చి ఏపీ కోరిన వాటిలో మెజారిటీని తీర్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక్కడే జగన్ తన అనుభవాన్ని సమర్ధతను సత్తాను చూపాలని అయిదు కోట్ల మంది ఏపీ జనాలు కోరుతున్నారు. జగన్ చేతిలో ఈ రోజు ఉన్న బలం అంతా ఏపీ జనాలు ఇచ్చినదే. ఆయన ప్రత్యేక హోదాను సాధిస్తాను పాతిక మంది ఎంపీలను ఇన్వండి అని కోరితే నమ్మి చేతిలో పెట్టినదే.

మరి ప్రజలు ఇచ్చిన ఈ బలనాన్ని ప్రజల కోసం వినియోగించడం నైతిక ధర్మం. ఆ విధంగానే జగన్ వ్యవహరించాలని అంతా కోరుతున్నారు. అలా కాకుండా కేంద్ర పెద్దలు చెప్పిన తీరున రాష్ట్రపతి ఎన్నికలలో భేషరతుగా మద్దతు ఇస్తే మాత్రం జగన్ గోల్డెన్ చాన్స్ మిస్ చేసుకున్నట్లే. అంతే కాదు అవసరం తీరాక బీజేపీ పెద్దల వైఖరి ఎలా ఉంటుందో కూడా ఎవరూ ఊహించలేరు. ఎందుకంటే కమలనాధులు ఫక్తు రాజకీయాలే ఎపుడూ చేస్తారు అని అంటారు.

అందుకే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ లాంటి వారు కూడా జగన్ డొంట్ మిస్ దిస్ గోల్డెన్ ఛాన్స్ అని పదే పదే చెబుతున్నారు. ఈ రోజు ఏపీ అంతా జగన్ వైపు చూస్తోంది. మరో వైపు మోడీ టీం కూడా జగన్ వైపు ఆశగా చూస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల రూపంలో వచ్చిన అవకాశాన్ని వాడుకుంటే జగన్ ఏపీ రాజకీయ చరిత్రలో చిరకాలం నిలిచిపోతారని అంటున్నారు. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి.

Tags: #BJP#indianpolitics#narendramodhi#president elections#ysjagan#YSRCP
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info