THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Crime

20వ తేదీ తర్వాత ఆర్యన్ భవిష్యత్తు..?

thesakshiadmin by thesakshiadmin
October 17, 2021
in Crime, Latest
0
20వ తేదీ తర్వాత ఆర్యన్ భవిష్యత్తు..?
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com   :   మహారాష్ట్రతోపాటు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోన్న షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుపై ఆ రాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే తొలిసారి స్పందించారు. ఇన్నాళ్లు ఈ వ్యవహారంపై సైలెంట్ గా ఉన్న ఉన్న మహారాష్ట్ర సీఎం.. ఇవాళ తొలిసారి మాట్లాడారు. సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆర్యన్ ఖాన్ కేసు వ్యవహారంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అత్యుత్సాహం చూపుతోందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే హాట్ కామెంట్స్ చేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు సెలబ్రిటీలను పట్టుకోవడంలో ఎక్కువగా ఆసక్తి ఉందని ఉద్దవ్ ఆరోపించారు. ఎన్సీబీ పట్టుకున్న డ్రగ్స్ గ్రాముల్లోనే ఉన్నాయని.. కానీ ముంబై పోలీసులు 150 కోట్ల విలువైన డ్రగ్స్ ముంద్రా పోర్టులో పట్టుకున్నారని థాక్రే గుర్తు చేశారు.

ఎన్సీబీకి సెలబ్రిటీలను పట్టుకోవడం.. వారిని ఫొటోలు తీసుకోవడం.. దీన్ని రచ్చ చేయడంపైనే ఎక్కువగా ఆసక్తి ఉందని థాక్రే వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర డ్రగ్ రాజధానిగా ఉందనేలా ఎన్సీబీ తయారు చేస్తోందని ఉద్దవ్ ఠాక్రే మండిపడ్డారు.

ఆర్యన్ ఖాన్ కేసే కాదని.. ముంద్రా పోర్టులో దొరికి డ్రగ్స్ కోట్లు విలువ చేసేవని.. కానీ గుప్పెడు గంజాయి పట్టుకొని ఎన్సీబీ హంగామా చేస్తోందని సీఎం ఉద్దవ్ ఎద్దేవా చేశారు. ముంబై పోలీసులు రూ.150 కోట్ల హెరాయిన్ పట్టుకున్నారని ఎన్సీబీని ఎద్దేవా చేశారు.

మహారాష్ట్ర పేరు ప్రతిష్టలకు భంగం కలిగించే కుట్ర ఇదీ అని.. దీన్ని డ్రగ్స్ కు అడ్డాగా చూపించే ప్రయత్నం చేస్తున్నా థాక్రే ఆరోపించారు. ఇలాంటి డ్రగ్స్ కేసుల వల్ల మహారాష్ట్రను ప్రజలు భూతద్దంలో చూసే పరిస్థితి వస్తోందని.. మమ్మల్ని టార్గెట్ చేస్తున్న వారు రేప్ లు హత్యలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్ ను ఎందుకు ప్రశ్నించడం లేదని ఉద్దవ్ నిలదీశారు.

తలరాతను ఎవరు తప్పించలేరంటారు. గ్రహస్ధితిగతులను బట్టి మన తలరాతలు మారిపోతుంటాయి. ఈ నిమిషంలో కింగ్ లా ఉన్న వ్యక్తి మరు నిముషంలో ఏమైపోతాడో ఎవరికీ తెలీదు. ఇప్పుడిదంతా ఎందుకంటే బాలీవుడ్ బాద్ షా గా పాపులరైన షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ గురించే ఇదంతా. దాదాపు పది రోజుల క్రితం ఓ క్రూయిజ్ లో జరిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఉన్నతాధికారుల దాడిలో చాలామంది తగులుకున్నారు. వారిలో ఆర్యన్ ఖాన్ కూడా ఒకడు.

దాడుల్లో ఆర్యన్ తగులుకున్నపుడు అతని దగ్గర నిషేధిత మత్తు పదార్థం అంటే ఛరస్ లాంటిది ఏవీ లేదు. అయితే అప్పటికే ఆర్యన్ ఛరస్ తీసుకున్నాడనేది ప్రధాన ఆరోపణ. అలాగే అతని మిత్రుడు అర్బాజ్ ఖాన్ దగ్గర మాత్రం 5 మిల్లీ గ్రాముల మత్తుపదార్థం దొరికిందట. ఈ మొత్తం ఎపిసోడ్ లో కొడుకును బెయిల్ పై బయటకు తీసుకు రావటానికి షారుఖ్ ఎన్ని తిప్పలు పడుతున్నాడో అందరు చూస్తున్నదే. దేశంలోనే ఖరీదైన లాయర్ ని పెట్టుకున్నా నాలుగు సార్లు బెయిల్ రెజెక్టయ్యింది.

ఎప్పటికప్పుడు బెయిల్ మంజూరైపోతుందని అనుకోవటం విచారణలో రిజెక్టవటం మామూలైపోయింది. ఇపుడు బెయిల్ రెజెక్టయిన కారణంగా 20వ తేదీ వరకు ముంబైలోని ఆర్ధర్ రోడ్డులో ఉన్న జైలులో ఉండి పోవాల్సిందే. ముంబయిలోనే అత్యంత విలాసవంతమైన ప్రాంతాల్లోని అత్యంత ఖరీదైన ప్యాలెసుల్లో షారూఖ్ ఖాన్ ‘మన్నత్’ కూడా ఒకటి. ఈ ప్యాలెస్ లో ఆర్యన్ కు విలాసవంతమైన బెడ్ రూమ్ ఉందట. ఆ బెడ్ రూమ్ లో ఖరీదైన టీవీ రిఫ్రిజిరేటర్ అత్యంత విలాసవంతమైన బాత్ రూమ్ ఉందట.

అంతటి లగ్జరీ ప్యాలెస్ లో హ్యాపీగా ఉంటున్న ఆర్యన్ ఇపుడు జైల్లోని ఇరుకు గదుల్లో 250 మంది ఖైదీలతో కలిసి ఉంటున్నాడు. నిజానికి ఈ బ్యారక్ లో ఉండాల్సిన ఖైదీల సంఖ్య 70 మందే కానీ సరిపడా స్ధలం లేకపోవటంతో 250 మందిని ఉంచుతున్నారు. ఉదయం 6 గంటలకే ఖైదీలను విజిల్ వేసి జైలు అధికారులు నిద్ర లేపేస్తున్నారు. మామూలుగా అయితే ఆర్యన్ డే మొదలయ్యేదే ప్రతిరోజు మధ్యాహ్నం పైనేనట. ఎందుకంటే రాత్రంతా ఎక్కడో పబ్బుల్లోనో బార్లు లేకపోతే పార్టీల్లో గడిపి రావటం ఆర్యన్ కు అలవాటు.

అలాంటి ఆర్యన్ ఇపుడు ఆరుబయట మిగిలిన ఖైదీలతోనే స్నానం చేస్తున్నాడు. జైల్లో బాత్ రూమ్ లు ఎంత శుభ్రంగా ఉంటాయో చాలా సినిమాల్లో చూసే ఉంటారు. అందుకనే బాత్ రూమ్ కు వెళ్ళాల్సొస్తుందని గడచిన వారం రోజులుగా భోజనం కూడా చేయటంలేదు. ఈ రోజో రేపే బెయిల్ వచ్చేస్తుంది కాబట్టి హ్యాపీగా బయటకు వెళ్ళచ్చని ఆర్యన్ అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే వారం వరకు జైల్లోనే ఉండాలని తేలిపోయిందో ఇపుడు ఏమి చేయాలో అర్థం కావటం లేదట. ఇపుడు జైలు భోజనం కోసం అందరితో పాటు క్యూలో నిలబడక తప్పలేదు.

మిత్రులు లేరు టీవీ లేదు ప్రత్యేకంగా బెడ్ రూమ్ లేదు. ఉదయం 6 గంటలకు లేచి స్నానం చేయాల్సిందే. అది కూడా తోటి ఖైదీలందరితో కలిసి. నచ్చినా నచ్చకపోయినా ఉన్న కొద్ది బాత్ రూమ్ లనే వాడుకోవాలి. ఆర్యన్ నిజంగానే ఛరస్ తీసుకున్నాడో లేదో తెలీదు. కానీ తీసుకున్నాడని ప్రభుత్వ న్యాయవాది బల్లగుద్ది మరీ వాదిస్తున్నారు. అంతర్జాతీయ డ్రగ్ మాఫియాతో ఆర్యన్ జరిగినట్లు చెబుతున్నాడు. అందుకు తన మొబైల్ నుండి జరిగిన వాట్సప్ చాటింగ్ నే సాక్ష్యంగా కోర్టులో చూపారు. మొత్తానికి 20వ తేదీ తర్వాత ఆర్యన్ భవిష్యత్తు ఏమిటో తేలుతుంది.

Tags: #ARYAN KHAN#ARYAN KHAN BAIL#MUMBAI#MUMBAI CRIME NEWS#SHAH RUKH KHAN
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info