THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

ప్రియుడిపై కేసుపెట్టింది..చివరకు ఏమైందంటే?

thesakshiadmin by thesakshiadmin
April 22, 2022
in Latest, Crime
0
IPC, CrPC సవరణ ప్రక్రియను ప్రారంభించిన కేంద్రం
0
SHARES
53
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com    :     ఓ యువతి తన ప్రియుడిపై కేసుపెట్టింది. అత్యాచారం చేసి గర్భవతిని చేశాడని పోలీసులకు పట్టించింది. కానీ ఇప్పుడదే యువతి అతడికి బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరుతోంది. అహ్మదాబాద్ నగరంలో ఈ కేసు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 2021 డిసెంబరు 31న ఓ యువతి తన ప్రియుడిపై కేసు పెట్టింది. తామిద్దరం ప్రేమించుకున్నామని.. పెళ్లి చేసుకుందామని అనుకున్నామని పోలీసులకు చెప్పింది. కానీ తాను గర్భం దాల్చగానే, అతడు మాట మార్చాడని వాపోయింది. తనను వదిలేసి కుటుంబంతో కలిసి సొంతూరికి వెళ్లిపోయాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం విచారణ ఖైదీగా జైల్లో ఉంటున్నాడు. ఐతే అతడిని జైలు నుంచి విడుదల చేయాలని అదే బాధితురాలు కోర్టుమెట్లెక్కింది. దీనికి కారణమేంటి? ఆమెలో ఎందుకు మార్పు వచ్చింది?

బాధితురాలు నిందితుడిపై కేసు పెట్టినప్పుడు ఆమె గర్భవతి. ఇప్పటికే ఆమెకు బిడ్డ పుట్టింది. కానీ తనను గర్భవతి చేసిన ప్రియుడు జైల్లో ఉన్నాడు. బిడ్డ పుట్టిన తర్వాత ఇరు కుటుంబాలకు పలు మార్లు చర్చలు జరిపాయి. ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించేందుకు ఇరు కుటుంబాలు అంగీకరించాయి. ఇప్పుడు అందరూ ఒప్పుకున్నా.. అంతా బాగానే ఉన్నా.. అతడు మాత్రం జైల్లో ఉన్నాడు. ఇదే ఇప్పుడు ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలోనే బాధిత యువతి మళ్లీ కోర్టు మెట్లెక్కింది. తాము ఇప్పుడు పెళ్లి చేసుకుంటామని, తన ప్రియుడికి బెయిల్ ఇవ్వాలని కోరింది. అతడు జైలు నుంచి విడుదలయితే..తన బిడ్డకు తండ్రి ప్రేమ కూడా దక్కుతుందని విజ్ఞప్తి చేసింది. ఇరు కుటుంబ సభ్యులు కూడా పెళ్లికి ఒప్పుకున్నారని.. జైలు నుంచి వచ్చిన వెంటనే పెళ్లి చేసుకుంటామని చెప్పింది.

ఈ పిటిషన్‌పై అహ్మదాబాద్ సిటీ సివిల్ కోర్టు విచారించింది. ఐతే తీర్పును మాత్రం రిజర్వ్‌లో ఉంచింది. దీనికి సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుధీర్ బ్రహ్మభట్ కూడా కోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. నిందితుడికి బెయిల్ ఇస్తే ప్రభుత్వానికి కూడా ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. నిందితుడు, బాధితురాలు పెళ్లి చేసుకొని..తమ బిడ్డతో సంతోషంగా ఉంటే.. అంతకన్నా ఏం కావాలని ఆయన పేర్కొన్నారు. మరి నిందితుడికి కోర్టు బెయిల్ ఇస్తుందా? లేదంటే నిరాకరిస్తుందా? అనేది చూడాలి. ఇరు కుటుంబాలు మాత్రం.. ఖచ్చితంగా బెయిల్ వస్తుందని నమ్మకంతో ఉన్నారు. జైలు నుంచి వచ్చిన వెంటనే.. ఇద్దరికీ వివాహం చేస్తామని తెలిపారు. ఆ కేసును కొట్టివేస్తే.. అందరూ సంతోషంగా ఉంటామని చెబుతున్నారు.

Tags: #AHAMADABAD#crimenews
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info