THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

పెళ్లికాని యువకులే లక్ష్యంగా నిత్య పెళ్లికూతురు!

thesakshiadmin by thesakshiadmin
March 28, 2022
in Latest, Crime
0
పెళ్లికాని యువకులే లక్ష్యంగా నిత్య పెళ్లికూతురు!
0
SHARES
54
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com   :   నిత్య పెళ్లికొడుకును మనం టీవీల్లో పేపర్లలో ఎన్నో సార్లు చూసుంటాం. కానీ నిత్య పెళ్లి కూతుళ్లు చాలా తక్కువగా ఉంటారు. రేర్ గా కనిపిస్తారు. అలాంటి ఓ కేడీ మగాళ్లను మోసం చేస్తూ ఆటాడుకుంటోంది. ఏకంగా 3 నెలల్లో ఆరు పెళ్లిళ్లు చేసుకుంది. చివరకి పట్టుబడింది. ఆ కేడీ లేడిని హర్యానాలో పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి నుంచి ఆమె ఇప్పటివరకూ ఆరు పెళ్లిళ్లు చేసుకుంది.

ఆమెకు గతంలోనే తొలి వివాహం జరిగింది. కానీ మోసాలు చేస్తూ నిత్యం ఎవరినో ఒకరిని చూసుకొని పెళ్లి చేసుకొని దండుకుంటోంది. ఆమె చేతిలో విడాకులు తీసుకున్నవారు.. పెళ్లికాని యువకులను లక్ష్యంగా చేసుకొని ఈ మోసాలకు పాల్పడుతోందని తేలింది.

తాజాగా ఆమె నాలుగో పెళ్లి చేసుకుంది. ఆ నాలుగో భర్త ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి ఆ యువతిని ఆమెకు సహకరిస్తున్న మరికొందరిని అరెస్ట్ చేశారు. విచారణలో షాకింగ్ విషయాలను ఆమె వెల్లడించింది. అదిప్పుడు వైరల్ గా మారింది.

ఈ మాయలేడి ‘ఖేదీ కరమ్ షామ్లి ప్రాంతానికి చెందిన సతీష్ ను మొదటి వివాహం చేసుకుంది. అక్కడి నుంచి తన నిత్య కళ్యానానికి తెరలేపింది. ఈ ఏడాది జనవరి 1న రాజస్థాన్ లో రెండో వివాహం ఫిబ్రవరి 15న మూడో వివాహం మరో 6 రోజుల తేడాతో రాజేందర్ అనే వ్యక్తిని నాలుగో వివాహం చేసుకుంది. కుటానా ప్రాంతానికి చెందిన గౌరవ్ ను ఐదోపెళ్లి కర్నాలకు చెందిన సందీప్ తో 6వ పెళ్లి చేసుకుంది.

ఇక తాజాగా మార్చి 26న బుద్వా ప్రాంతానికి చెందిన సుమిత్ ను ఏడో వివాహం చేసుకుంది. ఆమె మోసాన్ని గ్రహించిన నాలుగో భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మాయలేడి ఆటకట్టైంది. ఆమెపై పోలీసులు విచారణ జరిపి ఇంతమందిని పెళ్లి చేసుకొని మోసం చేసినందుకు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.విచారణలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. తనకూ ఎవరూ లేరని మగవాళ్లను నమ్మించేదని.. తన వలలో ఎవరైనా పడితే వారిని పెళ్లి వరకూ తీసుకువచ్చేది తెలిసింది. ఆమెకు ముఠా సభ్యులు సహాయక సహకారాలు అందించేవారని తేలింది.

ఇక మొదటి రాత్రే తన పన్నాగాన్ని ఈ లేడి అమలు చేసేది. శోభనం రోజు రాత్రియే భర్తకు మత్తుమందు ఇచ్చి అతడు సృహ కోల్పోయాక డబ్బు నగలతో పరారయ్యేది. ఇలా అందరినీ మోసం చేస్తూ వచ్చింది. కానీ చివరకు ఇలా పట్టుబడింది. ఆమె పాపం పండి మోసాలు వెలుగుచూశాయి.

ఆమె మాటల నమ్మి భారీగా డబ్బు నగలు ఇచ్చి పెళ్లి చేసుకొని శోభనం కోసం ఆత్రుతగా ఎదురుచూసే మగాళ్లకు ఆరోజే షాకిచ్చి పరార్ అయ్యేది ఈ లేడి. మోసపోయిన బాధితులు ఇప్పుడు పోలీస్ స్టేషన్ల గడుపతొక్కుతున్నారు.

Tags: #bride#CHEATING#crimenews#haryana#MARRIAGE'S#RAJASTHAN
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info