THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

ఏపీలో రైతులకు శుభవార్త..రేపు పంటల బీమా మొత్తాన్ని పంపిణీ చేయనున్న సీఎం వైఎస్ జగన్

thesakshiadmin by thesakshiadmin
June 13, 2022
in Latest, Politics, Slider
0
ఏపీలో రైతులకు శుభవార్త..రేపు పంటల బీమా మొత్తాన్ని పంపిణీ చేయనున్న సీఎం వైఎస్ జగన్
0
SHARES
304
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com     :     శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రైతులకు పంటల బీమా మొత్తాన్ని పంపిణీ చేయనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్.శ్రీ సత్యసాయి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకరోజు పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మంగళవారం రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నేకొత్తపల్లిలో జరిగే బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ రైతులకు పంటల బీమా సొమ్మును పంపిణీ చేయనున్నారు. కొత్త పథకం ద్వారా మొత్తం 15.61 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు.

లబ్ధిదారుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. గత మూడేళ్లలో 44.6 లక్షల మంది రైతులు ప్రభుత్వం నుంచి పంటల బీమా సొమ్మును పొందారు. పంట బీమా కింద పరిహారం పొందేందుకు అర్హులైన రైతుల జాబితాలు అన్ని రైతు భరోసా కేంద్రాల వద్ద ప్రదర్శించబడ్డాయి.

శ్రీ సత్యసాయి జిల్లాలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటనకు అన్నీ అనుకూలించేలా ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించారు.

ప్రకృతి వైపరీత్యాల వల్ల నోటిఫై చేసిన పంటలన్నింటికీ నష్టపోయిన రైతులకు వైఎస్ఆర్ ఫసల్ బీమా పథకం కింద పంట బీమా అందించబడుతుంది. దాదాపు 22 నోటిఫైడ్ పంటలు ఉంటాయి.

రైతులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. రేపు 2021 ఖరీఫ్‌ పంటల బీమా పరిహారాన్ని అందించనున్నారు. సీఎం వైఎస్ జగన్.. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తారు. ఇందుకు ఏర్పాట్లన్నీ పూర్తైయ్యాయి. ఈమేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఇందుకు శ్రీసత్య సాయి జిల్లా వేదిక కానుంది. రేపు సత్యసాయి జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. చెన్నేకొత్తపల్లిలో 2021 ఖరీఫ్‌ పంటల బీమా పరిహారాన్ని రైతుల ఖాతాల్లోకి వేయనున్నారు

రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు, సంక్షేమ పథకాల రూపకర్త, అన్ని వర్గాల ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  రేపు చెన్నేకొత్తపల్లి కి రానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,60,763 మంది రైతులకు 2977.82 కోట్ల రూపాయలను పంటల బీమాను ముఖ్యమంత్రి చెల్లిస్తున్నారన్నారు. చెన్నే కొత్తపల్లి బహిరంగ సభ లో ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులకు రూ. 925 కోట్లకు పైగా బీమా చెల్లిస్తున్నారు. ఇందులో అలాగే రాప్తాడు నియోజకవర్గం రైతులకు రూ. 116.59 కోట్లు అందజేస్తున్నారని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెలిపారు

రైతు బాంధవుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు నియోజకవర్గం పరిధిలోని రాప్తాడు, అనంతపురం రూరల్, ఆత్మకూరు, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, రామగిరి మండలాల నుంచి అధిక సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే  పిలుపునిచ్చారు..

Tags: #Andhrapradesh#apnews#cmjagan#cropinsurance#FARMERS#srisathyasaidistrict#topudarthiprakashreddy#ysjagan
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info