thesakshi.com : హుజురాబాద్ ఉప ఎన్నిక పార్టీ కార్యకర్తలను నిరాశపరిచాయి అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు.
ఒక ఉప ఎన్నిక ఫలితాల వల్ల పార్టీ కార్యకర్తలు నిరాశచెందకండి.పార్టీ అభ్యర్థి వెంకట్ నిరాశ చెందాల్సిన అవసరం లేదు- వెంకట్ కు మంచి భవిష్యత్తు ఉంది.కాంగ్రెస్ పార్టీకి వెంకట్ మంచి లీడర్ అవుతారు.
హుజురాబాద్ ప్రజల కోసం భవిష్యత్తు లో పోరాటం చేస్తాడు.హుజురాబాద్ ఎన్నికల ఫలితాలపై సంపూర్ణమైన భాద్యత నాదే నివేదికలు తెప్పించుకొని విశ్లేచన చేసుకుంటాం- రేవంత్ రెడ్డి.
రాబోయే రోజులన్ని కాంగ్రేస్ పార్టీవే.ప్రజా సమస్యలపై మరింత బాధ్యతగా కొట్లాడుతాం- రేవంత్.
హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరిగాయి.ఉప ఎన్నిక పార్టీ భవిష్యత్ ను నిర్ణయించలేవు.
గత ఎన్నికల్లో బిజెపి కి 16వందల ఓట్లు మాత్రమే వచ్చాయి- ఇప్పుడు గెలిచింది.మొన్న జరిగిన నాగార్జున సాగర్ ఎన్నికలో బీజేపీ కనిపించలేదు.
మీ కోసం నేను ఉంటా- ఈ ఓటమి నన్ను కుంగదియ్యదు.ఈ ఫలితాలు- హుజురాబాద్ ఎన్నికపై భవిష్యత్ స్పందిస్తా. ఈ ఓటమి నిరాశ శాశ్వతం కాదు- నిరాశ నుంచి నిర్మాణం చేపడుతాం- రేవంత్.
కాంగ్రేస్ లో సీనియర్ నాయకులకు పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది.పార్టీ విషయాలు అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటాం.సీనియర్లు పార్టీ కార్యక్రమాల్లో కలుపుకుని వెళతాం.