THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

కేసీఆర్ వర్సెస్ గవర్నర్..!

thesakshiadmin by thesakshiadmin
April 7, 2022
in Latest, National, Politics, Slider
0
కేసీఆర్ వర్సెస్ గవర్నర్..!
0
SHARES
340
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com   :   తెలంగాణలో ప్రగతి భవన్ రాజ్‌భవన్ మధ్య దూరం పెరిగింది.. కేసీఆర్ వర్సెస్ గవర్నర్ అన్నట్లుగా పరిస్థితి మారింది. అలాంటిది.. కేసీఆర్‌కు నచ్చినట్లు గవర్నర్ వ్యవహరించడమేంటి? అనుకుంటున్నారు. అవును.. ఇప్పుడే జరుగుతోంది. గవర్నర్ తమిళి సై దూకుడు పెంచితే తనకే కలిసి వస్తుందని కేసీఆర్ అనుకుంటున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్షా ను కలిసిన తర్వాత గవర్నర్ కేసీఆర్ ప్రభుత్వంపై మరింత జోరు ప్రదర్శించే అవకాశం ఉందన్న విశ్లేషకుల మాట. అది కేసీఆర్కే లాభం చేకూరుస్తుందని అంటున్నారు. కేసీఆర్‌కు కావాల్సింది కూడా అదే అనే మాటలు వినిపిస్తున్నాయి.

అందుకే సాగదీస్తున్నారు..
గవర్నర్ పదవి చేపట్టి మొదట్లో తమిళసైకి కేసీఆర్ ప్రభుత్వానికి మధ్య సత్సంబంధాలే సాగాయి. కానీ ఒక్కసారి ఆమె గవర్నర్ కోటాలో కౌశిక్రెడ్డి ఎమ్మెల్సీ ప్రతిపాదనను నిరాకరించడంతో దూరానికి బీజం పడింది. తెలంగాణలో బీజేపీని కట్టడి చేయాలనే పట్టుదలతో ఉన్న కేసీఆర్ కూడా.. గవర్నర్‌తో దూరం కొనసాగిస్తూ వస్తున్నారు. రిపబ్లిక్ డే ఉగాది వేడుకలకు సీఎంతో సహా మంత్రులు ఎమ్మెల్యేలు ఇలా టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు రాజ్‌భవన్‌కు వెళ్లలేదు.

మేడారం జాతర ముగింపు కార్యక్రమం యాదాద్రి ఆలయ సందర్శనకు గవర్నర్ వస్తే అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఆమె ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతోంది. మోడీ అమిత్ షాకు రాష్ట్రంలోని పరిస్థితులు కేసీఆర్ ప్రభుత్వ వ్యవహార శైలి వంటి విషయాల గురించి ఆమె వివరించారానే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాళ్ల సూచనలతో రాష్ట్రంలో గవర్నర్ ఏం చేయబోతున్నారో అనే ఆసక్తి కలుగుతోంది.

ఆ సూచనతోనే..
మరోవైపు ఎన్నికల కర్త ప్రశాంత్ కిషోర్ సూచనలతోనే గవర్నర్ విషయంలో తగ్గుదల అన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని సమాచారం. పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు కూడా ఇలాగే అక్కడ మమత వర్సెగ్ గవర్నర్ పోరు సాగింది. ప్రభుత్వంపై బీజేపీ గవర్నర్ పెత్తనం చేస్తున్నారంటూ మమత ఆ తర్వాత ప్రజల్లోకి తీసుకెళ్లారు. బీజేపీ పెత్తనాన్ని జనాలకు వివరించింది. దీంతో మమత పట్ల ప్రజల్లో సానుభూతి వ్యక్తమైంది.

మూడోసారి ఆమె ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడంలో అది కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు తెలంగాణలోనూ హ్యాటిక్ కొట్టాలని చూస్తున్న కేసీఆర్ కూడా మమత బాటలోనే సాగుతున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పీకే సూచనలతోనే గవర్నర్ విషయంలో కేసీఆర్ ఇలా దూరం పాటిస్తున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రభుత్వంపై గవర్నర్ దూకుడు ప్రదర్శిస్తే అప్పుడు బీజేపీని టార్గెట్ చేసి ఓట్లు గెలుచుకోవచ్చన్నది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే గవర్నర్ రెచ్చిపోతే అది కేసీఆర్కే మేలని అంటున్నారు.

Tags: #AmitShah#cmkcr#delhinews#KCR#MODI#TamilisaiSoundararajan#TELANGANA#telanganagoverner#telanganapolitics
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info