thesakshi.com : ఆన్ లైన్ విధానం ద్వారా సినిమా టిక్కెట్ల అమ్మకం జరపాలని సినీ ప్రముఖులే కోరారని మంత్రి పేర్ని నాని తెలిపారు.
సినీ పెద్దలే సూచననే ప్రభుత్వం పరిశీలించింది.
పన్ను ఎగవేత జరుగుతోందని ప్రభుత్వం గమనించింది.
బ్లాక్ టిక్కెట్లు లేకుండా అరికట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ప్రజలకు మేలు చేసేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
టిక్కెట్ రేట్లను, ఇష్టానుసారంగా షోలు వేయడాన్ని నియంత్రిస్తూ ఏప్రిల్ 8వ తేదీన ఇచ్చిన జీవో ఇచ్చాం.
ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే టిక్కెట్ల విక్రయం జరిపేలా ఆదేశాలిచ్చాం.
ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానంపై అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు.
ప్రభుత్వ నిర్ణయించిన ధరలకు ఆన్ లైన్ టిక్కెట్ల అమ్మకానికి సంబంధించి అధ్యయనం చేసేందుకు ఆలోచన చేసింది ప్రభుత్వం.
దీనిపై అర్ధం లేని విధంగా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.
దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేసే ప్రయత్నం చేయొద్దు.
2002 ఏడాదిలో ఈ ఆన్ లైన్ సిస్టం ద్వారా సినిమా టిక్కెట్లను అమ్మించే ప్రయత్నం చేయండని కేంద్రం కోరాం.
పన్నుల ఎగవేత అరికట్టొచ్చని గతంలో ప్రభుత్వాలు భావించాయి.
ఆన్ లైన్లో సినిమా టిక్కెట్లను అమ్మొచ్చని గత ప్రభుత్వం నిర్ణయించింది.
దీనికి సమ్మతి తెలుపుతూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అంగీకారం తెలిపింది.
ఎవరికో మేలు చేయడానికి విమర్శలు చేయడం సరికాదు.
ప్రభుత్వ ఆలోచనను అర్ధం చేసుకోవాలి.
నిర్మాతలు.. డిస్ట్రిబ్యూటర్లు.. సినిమా హాళ్ల యాజమాన్యాలతో త్వరలో సమావేశం జరపనున్నాం.
ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ నేతృతంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం.
జగన్ ప్రభుత్వం ఏ మంచి చేస్తోన్నా విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు.
ఆన్ లైన్ విధానం మంచిదని సినీ ప్రముఖులు చాలా మంది చెబుతున్నారు.
సినీ ఇండస్ట్రీ పెద్దలు సీఎం జగనుతో భేటీ అవుతామని కోరారు.
ఆగస్టులో భేటీ కావాలని భావించినా కుదర్లేదు.
త్వరలోనే సినీ పెద్దలు సీఎం జగనుతో భేటీ కానున్నారు.