THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

ఎట్టికేలకు వీడిన మిస్టరీ!

thesakshiadmin by thesakshiadmin
May 5, 2022
in Latest, Crime
0
పెళ్లై సరిగ్గా నెలకు ఏమిచేసిందంటే..?
0
SHARES
87
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com    :    సంచలనంగా మారిన హైదరాబాద్ శివారులోని యువతియువకుడి హత్యకు సంబంధించిన మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య.. తనను మోసం చేసి ప్రియుడితో కలిసి ఏకాంతంగా వెళ్లటంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతడు.. వారిని వెంబడించినట్లుగా విచారణలో తేలినట్లు చెబుతున్నారు.

హత్య జరిగిన ప్రదేశంలో లభించిన ఆధారాలు.. తాము సేకరించిన సాంకేతిక ఆధారాలతో హత్యకు గురైన మహిళ భర్తనే నిందితుడిగా అనుమానించిన పోలీసులు.. అతడ్ని అదుపులోకి తీసుకొని విచారించగా.. తానే వారిద్దరిని చంపినట్లుగా ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది.

గత కొంతకాలంగా యశ్వంత్.. జ్యోతి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లుగా ఆమె భర్త గుర్తించారు. కొంతకాలం క్రితం ఇంట్లోనే వారిద్దరూ ఏకాంతంగా గడుపుతున్న వైనాన్ని చూసి.. అప్పట్లోనే వారిని హెచ్చరించారు. అయినప్పటికి వారిలో మాత్రం మార్పు రాలేదని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఆదివారం సాయంత్రం వారాసిగూడ నుంచి యశ్వంత్.. జ్యోతి ఇద్దరు టూవీలర్ మీద వెళుతున్న విషయాన్ని గమనించి.. ఆమె భర్త వారిద్దరిని వెంబడించాడు.

దాదాపు 30 కి.మీ. వారికి అనుమానం కాకుండా ఫాలో అయ్యాడు. వారిద్దరు అబ్దుల్లాపూర్ మెంట్ మండలం కొత్తగూడ సమీపంలోని చెట్ల పొదల్లోకి వెళ్లటాన్ని గుర్తించాడు. అక్కడ వారిద్దరూ ఏకాంతంగా గడుపుతున్న వైనాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. తనతో తెచ్చుకున్న మద్యాన్ని తాగిన అతడు.. తీవ్ర ఆవేశానికి గురై.. అక్కడే ఉన్న పెద్ద రాయిని తీసుకొని భార్య తలపై మోదినట్లుగా చెబుతున్నారు. దీంతో.. ఆమె అక్కడికక్కడే మరణించింది.

తనతో తెచ్చుకున్న స్క్రూడ్రైవర్ తో యశ్వంత్ గుండెపై బలంగా పొడిచాడు. దీంతో కుప్పకూలిన అతడు అపస్మారకస్థితికి వెళ్లిపోయాడు. అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న జ్యోతి భర్త.. యశ్వంత్ మర్మాంగం మీద దాడి చేసి.. ఛిద్రం చేశాడు. ఇద్దరూ చనిపోయినట్లుగా నిర్దారించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

రెండు హత్యల్ని తానే చేసినట్లుగా జ్యోతి భర్త చెబుతుంటే.. పోలీసులు మాత్రం ఈ జంట హత్యల్ని అతడు ఒక్కడే చేసే అవకాశం లేదని.. మరొకరు కూడా ఉంటారని అనుమానిస్తున్నారు. తనకు సాయం చేసిన వారిని రక్షించాలన్న ఉద్దేశంతో జ్యోతి భర్త.. హత్యల్ని తానే చేసినట్లేనని ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ హత్యకు సంబంధించిన వివరాల్ని పోలీసు అధికారులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

Tags: #crimenews#doublemurdercase#HYDERABAD#TELANGANA
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info