thesakshi.com : ఏపీలో మంత్రి వర్గ ప్రక్షాళన అంశం.. అనేక మలుపులు తిరుగుతోంది. సీఎం జగన్ తన మంత్రి వర్గాన్ని పూర్తిగా మారుస్తున్న నేపథ్యంలో ఆయన ఎలాంటి ననిర్ణయం తీసుకుంటారు. ఎలా ముందుకు సాగుతారు? అనేది ఆసక్తిగాను.. ఆశ్చర్యంగా ఉంది. విషయంలోకి వెళ్తే.. 2019 ఎన్నికల్లో విజయం దక్కించుకున్న జగన్ పార్టీ.. ఆవెంటనే ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో మంత్రివర్గాన్ని చిత్రంగా కూర్పు చేసింది. ఈ మంత్రి వర్గం ఏర్పాటులో ఆయన సోషల్ ఇంజనీరింగ్కు ప్రాధాన్యం ఇచ్చారు.
అంతేకాదు.. ఏకంగా.. ఐదుగురు డిప్యూటీ ముఖ్యమంత్రులను కూడా నియమించారు. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ.. కాపు సామాజిక వర్గాలకు జగన్ ప్రాధాన్యం ఇచ్చారు. అయితే.. ఈ మంత్రి వర్గాన్ని రెండున్నరేళ్ల తర్వాత మారుస్తానని చెప్పిన.. జగన్.. అనుకున్న విధంగా ఇప్పుడు.. (కరోనా నేపథ్యంలో కొంత ఆలస్యం అయింది) మంత్రి వర్గాన్ని మారుస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అన్ని అడుగులు చాలా జాగ్రత్తగా వేస్తున్నారని.. అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఎన్నికలకు రెండేళ్లే సమయం ఉంది.
దీంతో అన్ని వర్గాల ప్రజలను మరోసారి మెప్పించాల్సిన అవసరం ఉంది. అందుకే.. జగన్ వ్యూహాత్మకం గా.. ముందుకు సాగుతున్నారు. ఈ క్రమలో ప్లాన్-ఏ ప్లాన్-బీలపై జగన్ దృష్టి పెట్టిన ట్టు తాడేపల్లి వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్లాన్ ఏ ప్రకారం.. మొత్తం 26 మంది కేబినెట్లో(సీఎంతో సహా)… ఇద్దరు ఓసీలకు(రెడ్లకు) కమ్మలకు 1 కాపు సామాజిక వర్గానికి చెందిన 2 కేటాయించి.. సీఎంగా తాను ఉన్నారు కాబట్టి.. మొత్తం 26 స్థానాల్లో ఆరు తీసేయగా.. 20 మంది మంత్రులకు ఇతర సామాజిక వర్గాలను కేటాయిస్తే.. బెటర్ అని జగన్ భావిస్తున్నట్టు సమాచారం.
అంటే.. ప్లాన్ ఏ ప్రకారం.. మొత్తం 20 మంది మంత్రులు కూడా ఎస్సీ. ఎస్టీ బీసీల నుంచే తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ప్లాన్ బీ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఉన్న మంత్రి వర్గం మాదిరిగానే.. ఇప్పుడున్న సామాజిక వర్గాల వారీగా.. నాయకులకు 2019లో ఎలాంటి అవకాశం ఇచ్చారో.. సేమ్ ఇచ్చి.. నలుగురిని ఉంచి.. మొత్తం అందరినీ మార్చడం. ఈ రెండు వ్యూహాలపైనా.. సీఎం జగన్ దృష్టి పెట్టినట్టు సమాచారం. మరి ఏది అమలు చేస్తో చూడాలి. ఏదేమైనా.. మంత్రి వర్గం మార్పుపై.. అధికార పార్టీలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొనడం గమనార్హం.
ఏపీలో ప్రతీ రాజకీయ పార్టీ తన సొంత సర్వేలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది అన్న విషయం తెలిసిందే. టీడీపీకి అయితే అనుకూల మీడియా సర్వేలు ఎప్పటికపుడు ఇస్తూ ఇస్తూ ఉంటుంది. అలాగే టీడీపీ వేరే వేరే చానళ్ల ద్వారా సర్వేలు చేయిస్తుంది అని చెబుతారు.
ఇక అధికార వైసీపీ విషయం తీసుకుంటే పీకే టీమ్ తో జగన్ గత మూడేళ్ళుగా టచ్ లో ఉంటున్నారు. అదే విధంగా చూసుకుంటే వేరే ఏజెన్సీల ద్వారా కూడా సర్వేలు చేయించి వాటి ఫలితాలను వైసీపీ అధినాయకత్వం తెప్పించుకుంటుంది. ఇక ఈ సర్వేల విషయం ఇపుడు ఎందుకు అంటే జగన్ స్వయంగా దాన్ని ప్రస్థావించినందుకు.
మంత్రివర్గ సమావేశంలో సర్వేల గురించి మంత్రులకు వివరించంట్లుగా చెబుతున్నారు. సర్వే ఫలితాలు చూస్తే ముఖ్యమంత్రి పనితీరు బాగుందని వచ్చిందని అదే టైమ్ లో కొంతమంది ఎమ్మెల్యే పనితీరు సరిగ్గా లేదని వారు ఓడిపోయే అవకాశం ఉందని వచ్చిందని చెప్పినట్లుగా తెలుస్తోంది.
మరి ఈ నంబర్ ఎంత అన్నది తెలియదు కానీ ఎమ్మెల్యేలు ఓడిపోతారు అన్న సర్వే నివేదికలు అయితే జగన్ వద్ద ఉన్నాయని అంటున్నారు. దాంతో ఆయన రేపటి గెలుపు కోసం ఇప్పటి నుంచే ఆందోళన పడుతున్నారు అని అంటున్నారు. ఇక ఓడిపోయే ఎమ్మెల్యేలను గెలిపించాల్సిన బాధ్యత మంత్రులుగా పనిచేసిన సీనియర్లు తీసుకోవాలి అని కూడా జగన్ అన్నట్లుగా చెబుతున్నారు.
దాంతోనే పార్టీ బాధ్యతలను మొత్తం మంత్రులుగా పనిచేసిన వారు మోయాల్సి ఉంటుందని జగన్ పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. ఇక ఎమ్మెల్యేలు ఓడిపోతారూ అంటే ఆ జాబితాలో మంత్రులు కూడా ఉండే ఉంటారని అంటున్నారు. మొత్తానికి మూడేళ్ల పాలన తరువాత అధికార పార్టీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందన్న నివేదికలు ముఖ్యమంత్రికి చేరాయని అంటున్నారు.
దాంతోనే ఆయన యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసి మరీ మంత్రులను ఫీల్డ్ లోకి పంపుతున్నారని తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యేలను కూడా ఇంటింటికీ వెళ్ళమని కోరడం వెనక కూడా వారి పనితీరు పెంచుకోవాలన్న ఆదేశాలు ఉన్నాయనే అంటున్నారు. ఏది ఏమైనా జగన్ వచ్చే ఎన్నికల మీద గురి పెట్టారు.
సర్వేలు చూస్తే అధికార పార్టీకి కొంచెం వ్యతిరేకంగానే వస్తున్నాయని అంటున్నారు. దీంతో సీనియర్లు పార్టీకి కొందరు ప్రభుత్వానికి అన్న ఫార్ములాతో జగన్ వచ్చే ఎన్నికల మీద గురి పెట్టారు అని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రయోగం ఎంతవరకూ ఫలిస్తుందో ఏమో.