THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

సడెన్ గా విజయవాడలో మెరిసిన హీరో నాగార్జున

thesakshiadmin by thesakshiadmin
October 28, 2021
in Latest, Movies
0
సడెన్ గా విజయవాడలో మెరిసిన హీరో నాగార్జున
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com   :   టాలీవుడ్ లో మరో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అక్కినేని హీరో నాగార్జున సడెన్ గా విజయవాడలో మెరిసారు. అంతే కాదు తన వెంట కొందరు నిర్మాతలను తీసుకుని మరీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. అంతేనా జగన్ తో ఆయన మధ్యాహ్నం భోజనం కూడా చేశారు.

మొత్తానికి ఈ భేటీ చాలా ఇంటెరెస్టింగ్ గానే ఉంది. టాలీవుడ్ లో టాప్ స్టార్స్ లో నాగార్జున ఒకరు. ఆయనకు స్టూడియో కూడా ఉంది. ఒక వైపు హీరోగా మరో వైపు నిర్మాతగా ఉన్నారు. ఇంకో వైపు కొడుకులు ఇద్దరూ హీరోలే. ఇక ఆయన ఫ్యామిలీ నుంచి కూడా హీరోలు ఉన్నారు. ఇలా అక్కినేని ఫ్యామిలీ టాలీవుడ్ లో ఒక బిగ్ కాంపౌండ్. అదే సమయంలో ఆయనకు జగన్ తో మంచి రిలేషన్స్ ఉన్నాయి. అవి ఈనాటివి కావు. జగన్ రాజకీయాలోకి రాక ముందు కూడా మంచి స్నేహం ఉందని చెబుతారు.

ఇక గత ఏడాది సినీ రంగానికి చెందిన సమస్యల మీద చర్చించేందుకు మెగాస్టార్ చిరంజీవితో కలసి నాగార్జున వచ్చారు. అయితే ఏడాది పై దాటింది ఆ భేటీ జరిగి. ఈ లోగా చాలా మార్పులు కూడా చోటుచేసుకున్నాయి. ఇంకో వైపు ఆన్ లైన్ టికెటింగ్ విధానం వైపుగా ఏపీ సర్కార్ అడుగులు వెస్తోంది. దాని వల్ల పెద్ద హీరోల సినిమాలకు ఇబ్బంది అన్న టాక్ ఉంది. ఇంకో వైపు టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కి కూడా జగన్ తో మంచి సాన్నిహిత్యం ఉంది. చిరంజీవి దంపతులకు తన ఇంట విందు ఏర్పాటు చేసి మరీ గౌరవించారు జగన్. ఇవన్నీ ఇలా ఉంటే ఈ మధ్య మా ఎన్నికలు జరిగాయి. అది ఒక సాధారణ ఎన్నికలను తలపించేలా సాగింది. అందులో కూడా పార్టీ రాజకీయాలు చేరాయని ఆరోపణలు వచ్చాయి.

ఇంకో వైపు చూస్తే రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేయడంతో వైసీపీ పెద్దలు హర్ట్ అయ్యారు. ఈ పరిణామాలన్నీ ఇలా ఉండగా ఇపుడు నాగార్జున రంగంలోకి వచ్చారు. ఆయన జగన్ తో భేటీ అయింది వ్యక్తిగతంగా అయితే కాదు అంటున్నారు ఆయన వెంట నిర్మాతలు కూడా ఉన్నారు కాబట్టి కచ్చితంగా టాలీవుడ్ సమస్యల మీదనే ఈ భేటీ అంటున్నారు. మరి టాలీవుడ్ సమస్యల మీద గతంలో చిరంజీవి పెద్దగా చర్చలు జరిగాయి. ఇపుడు హఠాత్తుగా నాగ్ ఎంట్రీ ఇవ్వడంతో తెర వెనక ఏమి జరిగి ఉంటుంది అన్న చర్చ కూడా వస్తోంది. చిరంజీవి రాకుండా నాగ్ ఒక్కడే రావడం అంటే అటు సినీరంగాన ఇటు రాజకీయ రంగాన కూడా హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి కుడి చేతికి సర్జరీ జరిగిందని అందుకే ఆయన రాలేదు అంటున్నారు. మొత్తానికి నాగ్ ని జగన్ రిసీవ్ చేసుకున్న తీరు ఇద్దరి మధ్య ఉన్న మంచి స్నేహ బంధం నేపధ్యంలో టాలీవుడ్ సమస్యలు అక్కినేని వారి ఆద్వర్యంలో పరిష్కారం అవుతాయా అన్న ఆశలు అయితే ఉంది. ఏది జరిగినా మన మంచికే అని టాలీవుడ్ భావిస్తోంది.

Tags: #AKKENENI NAGARJUNA#AP CM YS JAGAN MOHAN REDDY#VIJAYAWADA
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info