THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Crime

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణపై తీవ్ర ఉత్కంఠ

thesakshiadmin by thesakshiadmin
August 22, 2021
in Crime, Latest
0
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణపై తీవ్ర ఉత్కంఠ
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com   :   మాజీ మంత్రి వైఎస్ వివేకానంద కేసులో దూకుడు పెంచినట్టు కనిపించిన సీబీఐ మళ్లీ చేతులు ఎత్తేస్తోందా..? ఇప్పటికే చాలామంది కీలక వ్యక్తులను సీబీఐ అధికారులు విచారించారు. త్వరలోనే కేసుల కొలిక్కి వస్తోంది అంటూ ప్రచారం జరిగింది. కానీ తాజాగా సీబీఐ అధికారుల ప్రకటన చూస్తే.. మళ్లీ కేసుపై అనుమానాలు పెరుగుతున్నాయి.

స్థానిక ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి ఎవరైనా సరైన సమాచారం అందించాలని.. సీబీఐ కోరింది. అలా సమాచారం ఇచ్చినందుకు వారికి 5 లక్షల రూపాయల నజరానా ఇస్తామని సీబీఐ అధికారులు ప్రకటించారు వైఎస్ వివేకా హత్య కేసులో ఎదైనా సమాచారం తెలిస్తే ఇవ్వాలంటూ ప్రజలను సీబీఐ కోరింది. దీనికి సంబంధించి 2021, ఆగస్టు 21వ తేదీ శనివారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. వివేకా హత్యకు సంబంధించిన సమాచారం ఉంటే ప్రజలు ఇవ్వాలని, సమాచారం అందించిన వారికి 5 లక్షల నజరానా ఇస్తామంటూ ఆ ప్రకటనలో పేర్కొంది.

ఇప్పటికే పలువురు అనుమానితులను సీబీఐ విచారించింది. నలుగురి వద్ద పలు ఆయుధాలు స్వాధీనం చేసుకుంది. సమాచారం ఇవ్వాలి అనుకున్న వ్యక్తులు వివేకానంద రెడ్డి హత్య కేసు ఇన్వెస్టిగేషన్ అధికారి డీఎస్పీ దీపక్ గౌర్ (9474256974), పర్యవేక్షణ అధికారి ఎస్పీ రామ్ సింగ్ (9988272709) నెంబర్లకు వివరాలు అందించాలని సీబీఐ అధికారులు కోరారు.

సీబీఐ తాజా ప్రకటన చూస్తే.. అంతమందిని విచారించినా ఈ కేసులో ఇంకా సరైనా ఆధారాలు లభించలేదా..? మరి ఎందుకు ఇలాంటి ప్రకటన చేశారంటూ విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. వైఎస్ వివేకా హత్య అనంతరం ఈ కేసును సీబీఐకు అప్పగించడంతో ఇప్పటికే విచారణను ముమ్మరం చేశారు అధికారులు. పలువురిని విచారించారు కూడా. కానీ అసలు హత్య ఎవరు చేశారన్నది ఇప్పటికీ తేలలేదు. తాజాగా మరోసారి వివేకా అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని మరోసారి సీబీఐ అధికారులు విచారించారు.

దాదాపు ఏడాది నుంచి ఈ కేసుపై విచారణ చేస్తున్న సీబీఐ అనేక మంది అనుమానితులను ఇప్పటికే పలు దఫాలు ప్రశ్నించింది. మూడు నెలల కిందట నాలుగో దఫా విచారణ చేపట్టిన సీబీఐ.. వరుసగా 75 రోజుల పాటు విచారణ చేసింది. ఈ హత్య కేసులో స్పష్టమైన ఆధారాలు సేకరించాల్సి ఉన్నందున.. నమ్మకమైన సమాచారం ఎవరి దగ్గరైనా ఉంటే దాన్ని సేకరించేందుకు సీబీఐ ఈ ప్రకటన ఇచ్చినట్లు చెపుతోంది. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిలకు అత్యంత సన్నిహితులను కూడా విచారించడంతో విచారణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Tags: #CBI#FORMER MINISTER YS VIVEKANANDA REDDY#PULIVENDULA#YS VIVEKANANDA REDDY MURDER CASE
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info